రేవంత్ అమరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి : సబితా ఇంద్రారెడ్డి

స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా సీఎం రేవంత్‌రెడ్డి బూతు పురాణం మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.

Sabitha indra reddy
X

స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా సీఎం రేవంత్‌రెడ్డి బూతు పురాణం మాట్లాడాడం సిగ్గు చేటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రుణ మాఫీ పూర్తి చేయనందుకు ముఖ్యమంత్రి అమరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ,కేటీఆర్ ,హరీష్ రావు లను తిట్టక పోతే రేవంత్ కు పూట గడవడం లేదన్నారు. రేవంత్ ఎన్ని తిట్టినా హామీలపై బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటామని సబిత అన్నారు. రేవంత్ రెడ్డి సిగ్గు లజ్జ లేకుండా హరీష్ రావు పై అసభ్య విమర్శలు చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దేవుళ్ళను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డినే.. సూటి గా చెప్పు 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా అని కౌశిక్ ప్రశ్నించారు. కేవలం 17 వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లలో జమ అయినవి పేర్కొన్నారు. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు.

2018 లో రేవంత్‌ను కొడంగల్ మాజీ మంత్రి హరీష్ రావు చిత్తు చిత్తుగా ఓడించారు గుర్తులేదన్నారు. కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ సవాల్ చేశారు ఏమైందని కౌశిక్ ప్రశ్నించారు. ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పొద్దట్నుంచి అన్ని చోట్ల బూతులు మాట్లాడారని ఆయన భాషను చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి రేవంత్ చీడ ,పీడ అని ఇంత అసభ్య సీఎం దేశం లో మరొకరు లేరన్నారు. నోరు తెరిస్తే సీఎం వి అబద్దాలు ,అవాస్తవాలే మాట్లాడుతున్నరని పల్లా అన్నారు. 30 వేల ఉద్యోగాలపై ,సీతారామ సాగర్‌పై ముఖ్యమంత్రి, మంత్రులవి పచ్చి అబద్దాలన్నరు.. సీతారామ ప్రాజెక్టుకు 7400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేని ఆయన తెలిపారు

Vamshi

Vamshi

Writer
    Next Story