సొంత గూటికి చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు

సొంత గూటికి  చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
X

బీఆర్‌ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం గూటికి చేరారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, పొచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, సంజయ్ కుమార్, దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. 2009లో చేవెళ్ల నియోజకవర్గం నుండి పోటిచేసి టీడీపీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నం చేతిలో ఓడిపోయాడు.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రత్నంపై 781 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 33 వేల 552 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బీమ్ భరత్‌పై 268 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story