ఫామ్ హౌస్ లో కేసీఆర్ నవగ్రహ మహాయాగం
పాల్గొన్న కుటుంబ సభ్యులు, నాయకులు
- By Naveen KameraLoading...
- | 6 Sept 2024 11:09 AM GMT
X
X
ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ లో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం నవగ్రహ మహాయాగం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేది పండితులు ఈ యాగం నిర్వహించారు. కేసీఆర్, శోభ దంపతులు యాగంలో పాల్గొన్నారు. కేసీఆర్ మొదటి నుంచి యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. సీఎం హోదాలో 2015లో ఆయుత చండీయాగం నిర్వహించారు. 2019, 2023లో రాజశ్యామల యాగం చేశారు. త్వరలోనే రైతుల పక్షాన బస్సు యాత్రకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. తన యాత్ర ఫలవంతం కావాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ కేసీఆర్ నవగ్రహ మహాయాగం చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
Naveen Kamera
Writer
Next Story