రేవంత్‌ నాయకత్వాన్ని బలపరచాలనే పార్టీలో చేరా: పోచారం

కాంగ్రెస్ పార్టీతోనే నా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. మ‌ళ్లీ చివ‌ర‌గా రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

రేవంత్‌ నాయకత్వాన్ని బలపరచాలనే పార్టీలో చేరా: పోచారం
X

బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు నచ్చి, వారి నాయకత్వాన్ని బలపరచాలనే పార్టీలో చేరాను. కాంగ్రెస్‌ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, మళ్లీ చివరగా రేవంత్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాను అన్నారు. నా జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏమీ లేదు. బీఆర్‌ఎస్‌ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. నాడున్న పరిస్థితులను బట్టి బీఆర్‌ఎస్‌లో చేరాను. రైతుల సంక్షేమాన్ని మాత్ర‌మే నేను కోరుకుంటున్నాను. రేవంత్‌ను భ‌గ‌వంతుడు ఆశీర్వ‌దించాల‌ని ప్రార్థిస్తున్నాను అన్నారు.

Raju

Raju

Writer
    Next Story