ఝార్ఖండ్ బల పరీక్షలో నెగ్గిన సీఎం హేమంత్ సోరెన్

ఝార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెగ్గారు. 81 మంది ఎమ్మెల్యేలకు గాను 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్ సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి.

cmj
X

జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ నెగ్గారు. సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీ అసెంబ్లీలో స్పీకర్ రవీంద్రనాథ్ మెతో సమక్షంలో ఈ బల పరీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రికి సోరెన్ అనుకూలంగా 45 మంది ఓటు వేశారు. 81 మంది ఎమ్మెల్యేలకు గాను 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్ సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. హేమంత్ సోరెన్ భూకుంభకోణం కేసులో అరెస్టై ఇటీవల విడుదలయ్యారు.

ఆయన అరెస్ట్ తర్వాత దాదాపు ఐదు నెలలు చంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. హేమంత్ సోరెన్ విడుదల కావడంతో ఆయన రాజీనామా చేశారు. ఐదు నెలల అనంతరం మళ్లీ ముఖ్యమంత్రికి సోరెన్ ప్రమాణం చేశారు. అధికార కూటమిలో హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ప్రతిపక్షానికి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేశారు. దీంతో సభలో సంఖ్యాబలం 76కు తగ్గింది. దాంతో ఈ విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ నెగ్గారు. అయితే మరికొద్ది గంటల్లో సీఎం హేమంత్ సోరెన్.. తన కేబినెట్‌ను విస్తరించే అవకాశముందని సమాచారం.

Vamshi

Vamshi

Writer
    Next Story