స్పీకర్ పదవి వస్తే మంచిదే: అయ్యన్నపాత్రుడు
స్పీకర్ పదవి గురించి తాను మీడియాలోనే చూస్తున్నానని నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు అన్నారు.ఇప్పుడు స్పీకర్ పదవి వస్తే మంచిదేనని సంతోషమేనని తెలిపారు.
- By RajuLoading...
- | 19 Jun 2024 3:29 AM GMT
X
X
స్పీకర్ పదవి గురించి తాను మీడియాలోనే చూస్తున్నానని నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నంలోని అన్నా క్యాంటిన్ ఆయన పరిశీలించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనన్న అయ్యన్న తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు స్పీకర్ పదవి వస్తే మంచిదేనని సంతోషం వ్యక్తం చేశారు.
చంద్రబాబు కేబినెట్లో యువతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని అయ్యన్న సమర్థించి స్వాగతించిన విషయం విదితమే. ఎన్టీఆర్ హయాంలో మాలాంటి యువకులకు మంత్రివర్గంలో స్థానం కల్పించినప్పుడు అప్పుడు సీనియర్లు తమకు మద్దతుగా నిలిచారని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.Ayyanna patrudu, AP assembly Speakr, Andhrapradesh government, TDP
Raju
Writer
Next Story