ఢిల్లీలో సీఎం దీక్ష చేస్తానంటే, మేం మద్దతిస్తాం : హరీశ్రావు
బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో పోరాడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. అందరం వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామన్నారు. ఏకతాటిపైకి వచ్చి పోరాడదామని కేటీఆర్ అన్నారు.
- By VamshiLoading...
- | 24 July 2024 11:48 AM GMT
X
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది వాస్తమని దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తామని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటే వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉందని తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దీక్ష చేస్తే తాము మద్దుతు ఇస్తామని ప్రకటించారు. తొలుత రాష్ట్రానికి జరిగిన ఢిల్లీలో పోరాడదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు నిధులు తెస్తారో.. రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని తెలిపారు.
ఈ మాటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బదులిస్తూ.. ఢిల్లీలో దీక్ష చేసేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వస్తే.. ఢిల్లీలో దీక్ష చేసేందుకు తాను సిద్ధమన్నారు. కేసీఆర్ వస్తే.. జంతర్ మంతర్ వద్ద తానూ దీక్షలో కూర్చుంటా అన్నారు. రాష్ట్రానికి నిధులు కోసమైనా కేసీఆర్ దీక్షకు ముందుకు రావాలని సీఎం రేవంత్ కోరారు. పాలక పక్ష నేతగా తాను వస్తా అని.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా తాను సిద్ధమన్నారు. సచ్చుడో.. తెలంగాణకు నిధులు తెచ్చుకునుడో జరగాలన్నారు.