ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి : రఘునందన్

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతు పై ఉన్న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు

Ragunadhan
X

అధికారం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. డిసెంబర్ 9లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు.హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్‌ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ తేదీ ముగిసిపోయిన తర్వాత ఆగస్టు 15లోపు చేస్తామన్నారు. ఎవరికి ఇవ్వకూడదో పరిశీలిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు.

భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలన్నారు. అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు..తాజాగా రుణమాఫీపై కమిటి వేసి ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదతో పవిశీలిస్తామంటూ కబుర్లు చెబుతున్నారని ఎంపీ రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతుల ఉండి భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story