ఓయూలో సీఎం రేవంత్‌ దిష్టిబొమ్మ దహనం

అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో బీఆర్ఎస్వి నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

BRSV
X

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితాపై ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసనగా ఓయూలో బీఆర్ఎస్వి నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని బీఆర్ఎస్వి చటారి దశరథ్ అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించారని ఆయన అన్నారు..

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ఆయన అన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని సీఎం రేవంత్ మాట్లాడడం శోచమనీయమన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి మాత్రమే కాకుండా తెలంగాణ ఆడబిడ్డలందరినీ అవమానించేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు సీఎంకు తగులుతుందన్నారు. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు.. కానీ ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దశరథ్ మండిపడ్డారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story