పోచారం ఇంటి ముందు బీఆర్ఎస్ నేతల ధర్నా
బీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
- By VamshiLoading...
- | 21 Jun 2024 6:51 AM GMT
X
X
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ బాల్కసుమన్ ,ఇతర నేతలు ఆయన ఇంటి ఎదుట బైఠాయించారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ అక్కడే ఉండడంతో ఆందోళన చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోచారం మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Vamshi
Writer
Next Story