ఆరుగురు మంత్రులను డిసైడ్ చేయలేని దౌర్భగ్యపు పార్టీ కాంగ్రెస్ : పొన్నాల

కాంగ్రెస్ నేతలవి మాటలే తప్ప చేతలు లేవని మాజీ మంత్రి పొన్నల లక్ష్మయ్య అన్నారు.

ponnala
X

రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన గాలికి వదిలేసి ఢిల్లీలో మకాం వేశారని బీఆర్‌ఎస్ నేత మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకి మాటలే తప్ప చేతలు లేవన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ పెద్దలను తరచు కలుస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఆరుగురు మంత్రులను డిసైడ్ చేయలేని దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ చూస్తుందన్నారు. మంత్రివర్గంలో ఎపుడూ సామాజిక సమతూకాన్ని కాంగ్రెస్ పాటించదని, హస్తం పార్టీలో చేర్చుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌పై రేవంత్‌రెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని, వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల మాట మరిచారన్నారు. కాంగ్రెస్ నేతలవి మాటలే తప్ప చేతలు లేవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు

Vamshi

Vamshi

Writer
    Next Story