అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో మోకాళ్లపై ప్రణమిల్లిన చంద్రబాబు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతం అమరావతిలో పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని అధికారులను చంద్రబాబు తెలుసుకున్నారు.

అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో మోకాళ్లపై ప్రణమిల్లిన చంద్రబాబు
X

ముఖ్యమంత్రి తన రెండో క్షేత్రస్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టనున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను మొదలుపెట్టనున్నారు. ఉదయం చంద్రబాబు రాజధాని నిర్మాణాలను పరిశీలించారు. ఉద్ధండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగినప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించారు. ఫౌండేషన్ స్టోన్‌కి కొబ్బరికాయ కొట్టి మోకాళ్లపై ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి అక్కడ పూజలు చేశారు.

రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. శంకుస్థాపన ప్రాంతం పరిశీలిన అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను సీఎం పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పర్యటన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడనున్నారు.





Vamshi

Vamshi

Writer
    Next Story