ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం
కాసేపట్లో తన నివాసానికి కవిత
- By Naveen KameraLoading...
- | 28 Aug 2024 1:19 PM GMT
X
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం కవిత ఎయిర్ పోర్టుకు చేరుకోగా అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు కారిడార్ లో కవిత కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా పిడికిలి బిగించి జై తెలంగాణ అని నినాదాలు చేశారు. కార్యకర్తలు, నాయకులు జై తెలంగాణ నినాదాలతో ఎయిర్ పోర్టును హోరెత్తించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, నాయకులతో కలిసి బంజారాహిల్స్ లోని తన నివాసానికి కవిత బయల్దేరారు. కవిత నివాసం వద్దకు ఆమెకు అపూర్వ స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 165 రోజుల పాటు ఢిల్లీలోని తిహార్ జైల్ లో విచారణ ఖైదీగా ఉన్న కవిత సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో మంగళవారం రాత్రి రిలీజ్ అయ్యారు. 166 రోజులకు సొంతగడ్డపై అడుగు పెట్టిన కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రాండ్ వెల్ కప్ చెప్పారు. తన నివాసానికి చేరుకున్న తర్వాత కేటీఆర్ తో కలిసి కవిత మీడియాతో మాట్లాడనున్నారు.