ఆదివాసీలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే : బీఆర్ఎస్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆదివాసీ, గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.
- By VamshiLoading...
- | 9 Aug 2024 9:08 AM GMT
X
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆదివాసీ, గిరిజనులకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేని ఆయన అన్నారు. ప్రధానంగా ఆదివాసీల మూడు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల పట్టాలను నిజం చేసింది మాజీ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ 2,471 గూడేలను, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీ గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు వారికి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. జల్..జంగల్.. జమీన్ అన్న కొమురం భీమ్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు.