వరద బాధితులకు అండగా నిలవండి

బీజేపీ శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపు

వరద బాధితులకు అండగా నిలవండి
X

వరద బాధితులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలువాలని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్‌ లోని పార్టీ ఆఫీస్‌ లో అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వరదలతో వాటిల్లిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యలు అందించాలన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్న పార్టీ కార్యకర్తలను అభినందించారు. వారి సేవలు కొనసాగించాలని కోరారు. గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం (సెప్టెంబర్‌ 17) అధికారికంగా నిర్వహిస్తోందని.. ఈ ఏడాది కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. సెప్టెంబర్‌ 17 ఉత్సవాల నిర్వహణపైనా పార్టీ నాయకులతో ఆయన చర్చించారు.

Next Story