సుప్రీం కోర్టు తీర్పును అపహాస్యం చేసేలా బండి సంజయ్‌ కామెంట్స్‌

ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలి : కేటీఆర్‌

సుప్రీం కోర్టు తీర్పును అపహాస్యం చేసేలా బండి సంజయ్‌ కామెంట్స్‌
X

సుప్రీం కోర్టు తీర్పును అపహాస్యం చేసేలా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కామెంట్స్‌ ఉన్నాయని, ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు చేయడంపై సంజయ్‌ 'ఎక్స్‌' వేదికగా చేసిన కామెంట్స్‌ ను కేటీఆర్‌ ఖండించారు. సుప్రీం కోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేసిన సంజయ్ తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల విజయమని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఈ కామెంట్స్‌ పై కేటీఆర్‌ మండిపడ్డారు. కేంద్రమంత్రి గా ఉంటూ ఇంత చవకబారుగా మాట్లాడుతారా అన్నారు. దురుద్దేశ పూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Next Story