గురుకుల కొత్త టైం టేబుల్ కుదించాలని సీఎంకి బండి సంజయ్ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గురుకులాల్లో సిబ్బందిపై అధిక భారం అంశంపై ఆయన లేఖ రాశారు.

cm..
X

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. గురుకులాల్లో సిబ్బందిపై అధిక భారం అంశంపై ఆయన లేఖ రాశారు. కొత్త టైం టేబుల్ పనివేళలను కుదించాలని లేఖలో పేర్కొన్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు పని వేళలు రూపొందించడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడించారు.

రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు రాష్ట్రంలో హాస్టల్ వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరమని బండి సంజయ్ తెలిపారు. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం... కరీంనగర్ జిల్లా పోలీసులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలతో పాటు సరెండ్ లీవ్ బిల్స్ చెల్లించాలని ఆ లేఖలో కోరారు. వివిధ విభాగాల్లోని దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story