ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు!
ఏపీ శాససనభ స్పీకర్గా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కనున్నది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆయన పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
- By RajuLoading...
- | 17 Jun 2024 8:08 AM GMT
X
X
ఏపీ శాససనభ స్పీకర్గా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కనున్నది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆయన పేరును ఖరారు చేసినట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇవ్వనున్నారు. ఈ పదవికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు లోకం మాధవి, పంతం నానాజీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే క్యాబినెట్లో ఎక్కువ శాతంమందికి యువతకే చంద్రబాబు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. అదేసమయంలో సీనియర్ల సేవలను వేరే విధంగా ఉపయోగించుకుంటామని బాబు చెప్పారు.
ఈ మేరకు చీఫ్ విప్గా సీనియర్ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రకుమార్ నియమించనున్నారని తెలుస్తోంది.ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ ఎన్నుకోనున్నది.
Raju
Writer
Next Story