ప్రధాని మోదీ అదానీ బినామీ : షర్మిల

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లోకసభ ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ పరిణామాలను ఈ సమావేశంలో సమీక్షించారు.

ప్రధాని మోదీ అదానీ బినామీ  : షర్మిల
X

ప్రధాని మోదీ అవినీతిని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలతో ఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె షర్మిల పాల్గొన్నారు. అదానీ బినామి మోదీ అని ఆరోపించారు. అతన్ని కాపాడటానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజినేస్‌కు లాభం చేకూర్చుతూ అవినీతి రహిత పాలన అని ప్రచారం చేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఇటీవల లోకసభ ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ పరిణామాలను ఈ సమావేశంలో చర్చించారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూలంకుశంగా చర్చ జరిగింది అని పేర్కొన్నారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై చర్చ జరిగింది. ఏఏ అంశాల ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలో అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు అని అన్నారు. సేబీ” లాంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందనే విషయాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లే దానిపై చర్చించాం. క్షేత్ర స్థాయిలో కార్యాచరణపై సమావేశం నిర్ణయం తీసుకుంది.సమావేశంలో అందరి నుంచి అభిప్రాయలు తీసుకున్నారు. ఇలాంటి ప్రజాస్వామ్యబద్దంగా అభిప్రాయాలు తీసుకోనడం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అని షర్మిలా పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story