బేగంపేట ఎయిర్ పోర్టు‌లో కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం

కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వచ్చారు. దీంతో బీజేపీ తెలంగాణ సెల్యూట్ పేరున ర్యాలీ నిర్వహించారు

Kishan reddy
X

హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని 35 శాతానికి పెంచి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ తెలంగాణ తరఫున సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఇవాళ రాష్ట్రానికి వచ్చిన కిషన్‌రెడ్డికి బేగంపేట ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

ఈ సందర్భంగా మహిళా నేతలు ఆయనకు హారతులు ఇచ్చి వీరతిలకం దిద్దారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఇటీవల ఎన్నికైన ఎంపీలు, బీజేపీ ముఖ్య నేతలు నాంపల్లి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మేల్యేలు పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సభకు ఏర్పాట్లు చేశారు. సభలో మంత్రులకు, ఎంపీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు నేతలు దర్శించుకున్నారు. రసూల్ పూర, ప్యారడైజ్, రానిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణ గూడ, హిమాయత్ నగర్‌ల మీదుగా బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీని చేపట్టారు.

Vamshi

Vamshi

Writer
    Next Story