ఏపీ మాజీ సీఎం జగన్కు తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ మాజీ సీఎం జగన్కి పెను ప్రమాదం తప్పింది. పులివెందులకు వెళ్తుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. జగన్ కాన్వాయ్లోని ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది.
- By VamshiLoading...
- | 22 Jun 2024 9:57 AM GMT
X
X
మాజీ సీఎం జగన్కు తృటిలో ప్రమాదం తప్పింది. కడప నుంచి పులివెందులకు రోడ్డు మార్గాన వెళ్తున్న జగన్ కాన్వయ్లోని వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. జగన్ కాన్వాయ్లోని ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు కాన్వాయ్లోని వాహనాలు ఒకేసారి స్లో కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. కాగా, జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజులపాటు బస చేయనున్నారు. ఈ సమయంలో కడపకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ ఓటమిపై సమీక్షించనున్నారు.
Vamshi
Writer
Next Story