నీతా అంబానీ మెడలో రూ. 500 కోట్ల నెక్లెస్

అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో నీతా అంబానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన రూ. 500 కోట్లు నెక్లస్‌ ధరించింది.

Necles
X

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో నీతా అంబానీ ధరించిన నెక్లస్ హాట్ టాఫిక్‌గా మారింది. పచ్చలు, వజ్రాలు పొదిగిన దాని విలువ .అక్షరాల రూ.500 కోట్లు..ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెక్లస్‌లో ఇది ఒకటి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారియి.

ఇక నీతా వేసుకున్న బాజుబ్యాండ్ విలువ కూడా రూ.200 కోట్లపైన ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని ధరించేవారు. రూబీలు, వజ్రాలు, స్పినెల్స్‌తో పచ్చికకామ్ పద్ధతిలో దీన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు ఆ నక్లెస్ కు ప్రతిరూపం మరొక నక్లెస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిందంటే.. అది ఏ లక్షల్లో ఉంటుందేమో అని సహజంగా అనుకుంటారు. కానీ, అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. నీతా అంబానీ ధరించిన నక్లెస్ కాపీ ఓ వక్తి అలాంటి హారాన్ని ఆన్ లైన్ లో రూ. 178కే విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూాడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vamshi

Vamshi

Writer
    Next Story