ఎసెన్షియల్ బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం
అచ్యుతాపురం సెజ్ బాధితులకు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
- By VamshiLoading...
- | 24 Aug 2024 12:31 PM GMT
X
X
ఏపీలో అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు మాట్లాడాలని బొత్స తెలిపారు.
బాధితులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాత సీఎం కేజీహెచ్కు వచ్చారు. ఒక మంచి నీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదని బొత్స ఆరొపించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే మృతిచెందిన వారికి కోటి రూపాయల చెక్కును మాజీ సీఎం జగన్ అందించాము. అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశాము.’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని బొత్స అన్నారు.
Vamshi
Writer
Next Story