పురుగుల అన్నం.. కారం మెతుకులు తినలేక గురుకుల విద్యార్థుల ఆవేదన

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకులే గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చిన ఆందోళన చేశారు. హాస్టల్‌లో తమకు కనీస వసతులు కూడా కల్పించడం లేదని నిరసన తెలిపారు.

Students
X

సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చిన ఆందోళన చేశారు. హాస్టల్‌లో తమకు కనీస వసతులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పురుగులన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే మంచి కర్రీస్ చేసుకుని తింటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వచ్చి తమ సమస్యలను పరిష్కరించే వరుకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ప్రభుత్వ పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నరని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నరు. గురుకులాల అధ్వాన్న పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా మేము ఎన్ని సార్లు చెప్పినా మీకు చీమకుట్టినట్లైనా ఉండటం లేదు. ముఖ్యమంత్రి రావాలని, సమస్యలు పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story