జ్యోతిష్యుడు వేణుస్వామికి మహిళా కమిషన్‌ నోటీసులు

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న మహిళా కమిషన్‌ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

Venu Swamy
X

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న కమిషన్ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ విడిపోతారంటూ ఆయన జాతకం చెప్పడాన్ని తప్పబడుతూ తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత వేణుస్వామి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 2027లో ఇద్దరు విడిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సమంత, నాగ చైతన్య జంట సైతం విడిపోతారంటూ బయటపెట్టారు.

ఆ తర్వాత పలు విషయాలపై జాతకాలు చెప్పినా ఏ ఒక్కటి జరుగలేదు. గతంలో సినిమాల విడుదల, రాజకీయాలు ఇలాంటి వ్యాఖ్యలు చేసి అబాసుపాలైనా ఆయనకు బుద్ధి రాలేదని.. వ్యక్తిగత విషయాలపై నలుగురిలో మాట్లాడకూడదనే జ్ఞానం లేకుండా వేణుస్వామి వాళ్లు విడిపోతారంటూ వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. దీనికి స్పందించిన మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌ నేరెళ్ల శారద, వేణుస్వామిని పిలిపించి వివరణ కోరుతామని తెలిపింది. టెలికాస్ట్‌ చేసిన సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే వేణుస్వామికి మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story