సత్తా చాటిన కోహ్లి ..టీమిండియా స్కోరు ఎంతంటే ?

ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో విరాట్ కోహ్లీ(76) తొలి హాఫ్ సెంచ‌రీ బాదాడు.

VIRAT KOHALI44
X

ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. ప‌వ‌ర్ ప్లేలోనే టాప్ ఆటగాళ్లంతా డ‌గౌట్‌కు వెళ్లారు. దక్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్ ఒకే ఓవ‌ర్లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(9), రిష‌భ్ పంత్(0)ల‌ను ఔట్ చేశారు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే క‌గిసో ర‌బ‌డ డేంజ‌ర‌స్ సూర్య‌కుమార్ యాద‌వ్()ను వెన‌క్కి పంపాడు. కోహ్లి 59 బంతుల్లో 76(6 ఫోర్లు, 2 సిక్సులు), అక్షర్ 31 బంతుల్లో 47(4 సిక్సులు, ఒక ఫోర్) పరుగులతో అదరగొట్టారు. శివమ్ దూబే 27, రోహిత్ 9, సూర్య 3, పంత్ 0, హార్దిక్ 5*, జడేజా 2* రన్స్ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, నోర్టే చెరో 2 వికెట్లు, రబడ, జాన్సెన్ చెరో వికెట్ పడగొట్టారు. విజయం కోసం దక్షిణాఫ్రికా 177 పరుగులు చేయాలి.

Vamshi

Vamshi

Writer
    Next Story