మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో పనిచేస్తాం: సీఎం రేవంత్‌

తమ ప్రభుత్వంలో సర్వమతాలకు ప్రాధాన్యంమాన ఇస్తామన్నారు. అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ బాధ్యత అన్నారు.

మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో పనిచేస్తాం: సీఎం రేవంత్‌
X

కాంగ్రెస్‌ ప్రభుత్వం అందరిదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ఇస్కాన్‌ టెంపుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో సీఎం పాల్గొన్నారు. జగన్నాథ స్వామికి సీఎం హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో సర్వమతాలకు ప్రాధాన్యంమాన ఇస్తామన్నారు. అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ బాధ్యత అన్నారు. రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఈ యాత్ర ద్వారా భగవంతుడిని కోరుకుంటున్నాని తెలిపారు.

మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజంలో మార్పు వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story