అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టిన కూల్చివేస్తాం : రేవంత్రెడ్డి
అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టిన కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
- By VamshiLoading...
- | 28 Aug 2024 10:00 AM GMT
X
అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టిన కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చారించారు. ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీల కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయన్నారు. పామ్హౌస్లు కట్టుకున్న కొందరు ప్రముఖులు మురికినీటిని ఉస్మాన్, హిమాయత్సాగర్లోకి వదులుతున్నారు.
‘సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చివేసింది. సర్పంచులు కాదని ఆయనకు తెలియదా? నా కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా. విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోం’’ అని రేవంత్రెడ్డి తెలిపారు. ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ చేస్తున్న ‘హైడ్రా’కు త్వరలోనే పోలీస్ స్టేటస్ను కల్పిస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు