నటి కంగనా రనౌత్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వీహెచ్
కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. కంగనాపై అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
- By VamshiLoading...
- | 29 Aug 2024 10:15 AM GMT
X
కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. కంగనాపై అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా.. రాహుల్ గాంధీ చెత్తగా మాట్లాడతారని, డ్రగ్స్ తీసుకుంటారని కంగనా ఆరోపించారు. ఆయన పద్ధతి లేని వ్యక్తి అని, కుర్చీ కోసం పాకులాడే వ్యక్తి అని, ప్రతిసారి తన దారిని మార్చుకుంటారని ఆమె విమర్శించారు.ఈ వ్యాఖ్యలను ఖండించిన వీహెచ్... పాపులారిటీ కావడం కోసమే కంగనా ఇలాంటి కామెంట్స్ చేశారన్నారు. ఆమె ఏదున్నా పార్లమెంట్లో మాట్లాడాలని సూచించారు.
రాహుల్కి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని.. రాహుల్తోపాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలందరినీ ఆమె అవమానించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుడి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే... దానినీ కూల్చేయాలని సీఎం ఆదేశించడం మంచి నిర్ణయమని వీహెచ్ అన్నారు. నగరంలో చెరువులు, ఇతర వనరుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా తీసుకువచ్చారని, రేవంత్ రెడ్డి భేషైన వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చక్కగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయాల్సి వస్తే మాత్రం వారికి ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలని వీహెచ్ సూచించారు.