తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రధానికి వెంకయ్య వినతి
ఏపీ, తెలంగాణకు రూ.5 లక్షల చొప్పున వ్యక్తిగత సాయం
- By Naveen KameraLoading...
- | 2 Sept 2024 9:44 AM GMT
X
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. సోమవారం ప్రధానికి ఫోన్ చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కుండపోత వర్షాలు, వరదల ఉధృతి, తీవ్ర నష్టం గురించి వివరించారు. రెండు రాష్ట్రాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను రెండు రాష్ట్రాల సీఎంలతో ఇప్పటికే మాట్లాడానని, ఆ రాష్ట్రాల అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు టచ్ లో ఉన్నారని తనతో ప్రధాని చెప్పారని వెంకయ్య వెల్లడించారు. తన వంతుగా రెండు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తానని వెల్లడించారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ ముప్పవరపు ఫౌండేషన్ తరపున రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.2.50 లక్షల చొప్పున, తన కుమార్తె దీపావెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ.2.50 లక్షల చొప్పున సాయం అందజేస్తున్నామని తెలిపారు.