కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు.

కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత
X

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్‌ నేతలు ఉమ్మడిగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా.. కేంద్ర మంత్రి ముక్కు నుంచి రక్తం కారింది.దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారడం, ఆయన అంగీపై రక్తపు మరకలు ఉన్న దృశ్యాలు మీడియాలో చూసిన జేడీఎస్‌ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. అయితే కేంద్ర మంత్రికి వైద్యులు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.

బీజేపీ-జేడీఎస్‌ సమన్వయ సమావేశం నేడు ఉదయం జరిగింది. ఈ భేటీలో కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను ఎత్తిచూపుతూ బెంగళూరు నుంచి మైసూర్‌ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర 10వ తేదీ వరకు కొనసాగుతుంది.

Raju

Raju

Writer
    Next Story