కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Dam
X

కర్ణాటక, ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యామ్ నిండు కుండలా మారింది. ఈ క్రమంలోనే అధికారులు దిగువకు నీటిని విడుదల చేసేందుకు గేట్లును ఎత్తగా.. డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యామ్ భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కీలక ప్రకటన చేశారు.

ముఖ్యంగా కర్నూలు జిల్లా కౌతాలం. కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చారించారు. తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడం వల్ల…అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే.. తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకు వెళ్లిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మంత్రి పయ్యావుల. నీటిని నిలువరించేందుకు తీసుకుంటున్న చర్యలపై కర్ణాటక ప్రభుత్వం, తుంగభద్ర డ్యాం ఇంజనీర్లతో పయ్యావుల సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సందర్బంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ….తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడం బాధాకరమన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story