ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IAS
X

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎన్‌.తేజ్‌ భరత్‌, చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌గా అభిషేక్‌.వి, పాడేరు సబ్‌ కలెక్టర్‌గా ప్రఖర్‌ జైన్‌ను నియమించగా పాడేరు ఐటీడీఏ పీవోగా ప్రఖర్‌ జైన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది.కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా రాహుల్‌ మీనా, అనంతపురం జిల్లా జేసీగా శివ నారాయణ శర్మ, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌గా జి.విద్యాధరిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా అశుతోష్‌ శ్రీవాస్తవను నియమిస్తూ ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతల్ని అప్పగించింది. ఏటిపాక సబ్‌ కలెక్టర్‌గా అపూర్వ భరత్‌కు చిత్తూరు ఐటీడీఏ పీవోగా పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు వెలువరించారు. ఏపీలో రెండు రోజుల కిందట పది మంది ఐపీఎస్‌లు కూడా బదిలీ అయ్యారు.

Vamshi

Vamshi

Writer
    Next Story