తెలంగాణలో ఐపీఎస్ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో 8మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- By VamshiLoading...
- | 1 July 2024 11:51 AM GMT
X
X
తెలంగాణలో 8 మంది ఐపీఎస్ల బదిలీ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగుడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్,ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్కుమార్, బైంసా ఏఎస్పీగా అవినాష్కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రినిరెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయను బదీలీ చేశారు. గత నెలలోనూ పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు, పలుజోన్లకు డీసీపీలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
Transfer of IPS in Telangana
Vamshi
Writer
Next Story