బీహార్‌లో విషాదం..కరెంట్ షాక్‌‌తో 9 మంది భక్తులు మృతి

బీహార్‌లోని హాజీపూర్‌లో కావడి యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. కన్వర్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్‌ వైర్‌ తగిలడంతో తొమ్మిది మంది మరణించారు.

Current shock
X

బీహార్‌లోని హాజీపూర్‌లో కావడి యాత్రలో ఘోర విషాదం జరిగింది. కన్వర్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్‌ కరెంట్ వైర్‌ తగలడంతో తగలడంతో 9 భక్తులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కావడి యాత్రికులు పహెల్జా నుంచి గంగాజలాన్ని తీసుకుని సోన్‌పూర్‌లోని బాబా హరిహరనాథ్‌ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

కన్వరియాలు ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, దానికి 11 వేల వోల్టుల విద్యుత్‌ తీగ తగిలిందని స్థానిక ఎస్డీపీవో ఓంప్రకాశ్‌ వెల్లడించారు. దీంతో వారు కరెంట్ షాక్‌కి గురయ్యారని చెప్పారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అధికారులు..ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే భక్తుల ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story