నేటి నుంచి ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రతిష్ఠ, కార్యక్రమాలు ఇవాళ ఘనంగా నిర్వహించనున్నారు. వినాయక చవితి పర్వదినం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Traffice
X

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రతిష్ఠ, కార్యక్రమాలు ఇవాళ ఘనంగా నిర్వహించనున్నారు. వినాయక చవితి పర్వదినం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ రోజు నుంచి విగ్రహం నిమజ్జం అయ్యే వరుకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతల్లో ఈ నెల 17వ తేది వరుకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పొలీసులు పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story