ఏపీలో రియాక్టర్ పేలి ఏడుగురి మృతి.. 25 మందికి తీవ్రగాయాలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్‌ పేలి ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

SEZ
X

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్‌ పేలి ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనకాపల్లి లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఘటన జరగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు సమయంలో విధుల్లో 300 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఫస్ట్ ఫ్లోర్‌లో పైకప్పు కూలడంతో కొందరు చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి సిబ్బంది శరీర భాగాలు ఛిద్రమైనట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story