హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకే
తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక
- By RajuLoading...
- | 4 Sept 2024 7:11 AM GMT
X
X
హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా పేరుతో డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే స్థానిక పోలీస్స్టేషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.
బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని, హడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరిస్తున్నారని అలాంటి వారి చేతిలో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో డబ్బు వసూళ్లకు పాల్పడిన విప్లవ్ను పోలీసులు అరెస్టు చేసినట్లు రంగనాథ్ వివరించారు.
Raju
Writer
Next Story