18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలి : సుదర్శన్ రెడ్డి
తెలంగాణలో జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారంతా ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.
- By VamshiLoading...
- | 5 Sept 2024 3:26 PM GMT
X
X
తెలంగాణలో జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారంతా ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ జూలై 20న నుండి జరుగుతోందని.. అక్టోబరు 29 వరకు ముసాయిదా జాబితా ప్రకటించి, నవంబరులో అభ్యంతరాలను స్వీకరించి, జనవరి 6న తుది జాబితా వెల్లడిస్తామని అన్నారు. ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు 8 లక్షల కొత్త అప్లికేషన్స్ వచ్చాయని పేర్కొన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలకు శిక్షణ పూర్తయిందన్నారు. ఓటరు కార్డు , ఆధార్ లింక్ దాదాపు 60% పూర్తయ్యిందని తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో3,33,27,304 మంది ఓటర్లు ఉన్నట్టు కమిషనర్ పేర్కొన్నారు.
Vamshi
Writer
Next Story