కానిస్టేబుల్ను పరామర్శించిన గవర్నర్
పాము కాటుకు గురై ములుగు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ప్రశాంత్ను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి దనసరి సీతక్కతో కలిసి పరామర్శించారు.
- By VamshiLoading...
- | 28 Aug 2024 10:38 AM GMT
X
X
పాము కాటుకు గురై ములుగు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ప్రశాంత్ను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి దనసరి సీతక్కతో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. మైరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రేహౌండ్స్తో అధికారులు ముందస్తుగా భారీగా భద్రతా దళాలను మోహరించారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్కు పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటున కానిస్టేబుల్ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించి వైద్యమందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్కు తరలించారు
Vamshi
Writer
Next Story