నేతన్నల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం : బండి సంజయ్‌

హైడ్రా పేరుతో ఆరు గ్యారంటీలను రేవంత్ ప్రభుత్వం పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు

Bandi Sanjay
X

నేత కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తాను సీఎం రేవంత్ ‌రెడ్డికి లేఖ రాస్తానని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. నేత కార్మికుల విద్యుత్ విషయంలో గత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం మోసం చేశాయన్నారు. నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తామని మోసం చేశాయన్నారు.

హైడ్రా పేరుతో ఎన్నికల హామీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని సంజయ్ అన్నారు. హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చేసి తెలంగాణ ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. పెద్దోళ్లను కొట్టి చిన్నోళ్లకు ఇవ్వాలి. తెలిసి తెలీక కొందరు ఇళ్లు కట్టుకున్నారు.. వాటిని కూల్చేస్తే ఎలా బండి ప్రశ్నించారు. సకలం చెరువులో కట్టిన కట్టడాలను ఎందుకు కూల్చడం లేదు. రైతు రుణమాఫీ రూ.47వేల కోట్లు చేస్తామని చెప్పి.. రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు’’ అని బండి సంజయ్‌ అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story