ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈ నెల 31 వరకు పొడిగింపు

ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది.

ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈ నెల 31 వరకు పొడిగింపు
X

ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. జులై 5 నుంచి ఈరోజు వరకు బదిలీల ప్రక్రియ జరిగేలా ఈ నెల 3వ తేదీన ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ జరగలేదని, పైరవీలు చేసుకున్న వాళ్లకే కొన్నిచోట్ల మంచిచోట్ల పోస్టింగులు వచ్చాయని ఉద్యోగులు ఆందోళకు దిగారు. దీంతో బదిలీలు కొలిక్కి రాలేదు.

దీంతో బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story