పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25లక్షల చెక్కును అందించిన సీఎం
సచివాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందించారు
- By VamshiLoading...
- | 10 July 2024 2:20 PM GMT
X
సచివాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్రెడ్డి రూ.25లక్షల చెక్కును అందించారు. గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప వేలు ఆనందచారి , కూరేళ్ల విఠలాచార్య , కేతావత్ సోంలాల్ . ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులను అందించిన సందర్బంగా ముఖ్యమంత్రికి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క పాల్గొన్నారు.
పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పద్మపురస్కారాలకు ఎంపికైన వారికి శిల్పకళావేదికలో సన్మానించారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారు పద్మవిభూషణ్ గ్రహీతలు వెంకయ్యనాయుడు, చిరంజీవి, పద్మ శ్రీ గ్రహీతలు దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య, ఉమామహేశ్వరిని ప్రభుత్వం తరుపున సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానించారు.