కేదార్నాథ్లో చిక్కున్న తెలుగు యాత్రికులు
కేదార్నాథ్లో వరదల్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నరు
- By VamshiLoading...
- | 3 Aug 2024 12:13 PM GMT
X
కేదార్నాథ్లో తెలుగు యాత్రికులు చిక్కున్నారు. భారీ వర్షాలను ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతుంది. మందాకిని నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో భారీ వరదలు సంభవించి జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరదల్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా నడకమార్గం మొత్తం దెబ్బతినడంతో పాటు గౌరీకుంద్ - కేదార్నాథ్ మధ్య 13 మార్గాలు విధ్వంసం అయ్యాయి. దీంతో యాత్రికులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకున్నారు. తెలుగు యాత్రికులు వరదల్లో చిక్కుకున్న స్వర్గరోహిణి కాటేజిలో ఆహారం, నీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు భాదితులు మెసేజ్ చేశారు .తమకు వెంటనే సహాయం చేయాలని వారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తనకు మెసేజ్ వచ్చిన వెంటనే బండి సంజయ్ ఉత్తరఖాండ్ ప్రభుత్వంతో మాట్లాడారు. వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సహాయక చర్యలకు సైతం వాతావరణం అనుకూలించడం లేదని తెలుస్తోంది. అటు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు..రంగంలోకి దిగాయి. గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, డోన్లతో గాలిస్తున్నాయి సహాయక బృందాలు.. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు చోటు చేసుకున్నాయి