బడుల పరిశుభ్రతకు నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

బడులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 'అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ'కి స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

SCHOOLS
X

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రత కోసం తెలంగాణ సర్కార్ నిధులు కేటాయించింది. మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంట్స్ మంజూరు చేసింది. పాఠశాలల నిధులకు అదనంగా ఈ గ్రాంట్‌ను కేటాయించినట్లు తెలిపింది. తెలంగాణలోని పాఠశాలల్లో క్లీన్‌గా లేక పోయాడంతో నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

30 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.3 వేలు, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్నస్కూల్‌కి రూ.6 వేలు, 101 నుంచి 200 మంది ఉంటే రూ.8 వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులు ఉంటే రూ.12 వేలు, 501 నుంచి 750 మంది వరకు విద్యార్థులు ఉంటే రూ.15 వేలు, 750 కంటే ఎక్కువ మంది ఉంటే రూ.20 వేల చొప్పున గ్రాంట్ ఇవ్వనుంది. మొత్తం 10 నెలల కాలానికి ఒకేసారి నిధులు విడుదల చేస్తారు.

Vamshi

Vamshi

Writer
    Next Story