సీఎం ఇంటి ముందు టీచర్ల నిరసన

తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి ముందు ప్రభుత్వ టీచర్ల పడిగాపులు

Govt teachers protest
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదంటూ సిబ్బంది వెళ్లిపొమ్మందని ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ బాధలు అర్థం చేసుకుని 317 జీవో విషయంలో ప్రభుత్వ టీచర్లకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జీవో 317, 46 బాధితులకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇక గతంలో జీఓను రద్దు చేయాలంటూ కొంతమంది ఉద్యోగులు హైకోర్టును కూడా ఆశ్రయించారు.317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఎంత నష్టపోతున్నామో మాకు తెలునని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో కూడా ఈ జీవో అంశంను చేర్చడం జరిగిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.


Vamshi

Vamshi

Writer
    Next Story