నీట్ పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు : రాష్ట్రపతి
పార్లమెంట్లో ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని ఆమె పేర్కొన్నారు.
- By VamshiLoading...
- | 27 Jun 2024 8:33 AM GMT
X
నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉభయసభలను ఉద్దేశించి ఆమె నేడు పార్లమెంట్లో మాట్లాడారు. పరీక్షల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహిస్తామన్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి సభకు ఎన్నికయ్యారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నా ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతం అవుతారని ఆశిస్తున్న అని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని ఆమె అన్నారు.
భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందన్నారు. ఇదే అంశాన్ని ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ కూడా అన్నారు. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై దాడి చేశారని ధంకర్ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విషయంలో బీజేపీ, విపక్షాల మధ్య చాన్నాళ్లుగా వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎమర్జెన్సీ విధించడం వల్ల దేశంలో ఎటువంటి అనర్థాలు జరిగాయో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఇటీవల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు దేశంలో గత పదేళ్ల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. భారత్ను అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. అన్ని రంగాల్లో భారత్ శరవేగంగా ఆత్మనిర్భర్ దిశగా వృద్ధి చెందుతోందన్నారు.