శ్రీదేవి జయంతి .. శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ
అలనాటి అందాల నటి శ్రీదేవి 61వ జయంతి సందర్బంగా ఆమె కుమార్తె జాన్వీ కపూర్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్మించుకున్నారు. మెట్ల ద్వారా కొండపైకి చేరుకుని స్వామివారిని దర్మించుకున్నారు.
- By VamshiLoading...
- | 13 Aug 2024 9:22 AM GMT
X
అలనాటి అందాల నటి శ్రీదేవి 61వ జయంతి సందర్బంగా ఆమె కుమార్తె జాన్వీ కపూర్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్మించుకున్నారు. మెట్ల ద్వారా కొండపైకి చేరుకుని స్వామివారిని దర్మించుకున్నారు. ప్రతి సంవత్సరం జాన్వీ, శ్రీదేవి బర్త్కి వెంకన్న స్వామిని దర్శించుకువడం అనవాయితీ. ఈ సందర్భంగా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్స్టాలో ఆమె ఒక పోస్ట్ చేశారు. ఇందులో తిరుపతి మెట్లు, తల్లితో తన చిన్నప్పటి ఫొటో, తాను చీరలో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే అమ్మా. ఐ లవ్యూ' అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. కాగా, తిరుపతి అన్నా, తాను చీర కట్టినా తన తల్లికి చాలా ఇష్టమని జాన్వీ పలు సందర్భాల్లో తెలిపారు.
ఇక జాన్వీ కపూర్ చిత్రల విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న 'దేవర' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారామె. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఆమె పోస్టర్, పాటకు మంచి స్పందన వచ్చింది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా హీరోయిన్గా జాన్వీ ఎంపికయ్యారు. త్వరలోనే ఈ మూవీ సెట్పైకి వెళ్లనుందని సమాచారం. అనంతరం టీటీడీ అధికారులు రంగనాయక మండపంలో జాన్వీ కపూర్కు పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు ఆమెను ఆశీర్వదించి, లడ్డూ ప్రసాదం అందించారు.