టాస్ గెలిచిన శ్రీ‌లంక‌...టీమిండియా బ్యాటింగ్

మూడో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

Srilaka
X

మూడో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వ‌ర్షం కార‌ణంగా ఔట్ ఫీల్డ్ త‌డిగా మారింది. దాంతో, అంపైర్లు టాస్ ఆల‌స్యంగా వేశారు. ముచ్చ‌ట‌గా మూడో మ్యాచ్‌లోనూ లంక‌ను ఓడించాల‌ని సూర్య‌కుమార్ యాద‌వ్ బృందం భావిస్తోంది. మ‌రోవైపు నామ‌మాత్ర‌మైన ఈ మ్యాచ్‌లోనైనా విజ‌యంతో ప‌రువు కాపాడుకోవాల‌ని లంక ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య ఆదివారం జ‌రిగిన రెండో టీ20కి వరుణుడు అడ్డుప‌డ్డాడు. దాంతో, భార‌త ఇన్నింగ్స్‌ను 8 ఓవ‌ర్ల‌కు కుదించారు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

భార‌త జ‌ట్టు : య‌శ‌స్వీ జైస్వాల్, శుభ్‌మ‌న్ గిల్, సూర్య‌కుమార్ యాద‌వ్(కెప్టెన్), సంజూ శాంస‌న్(వికెట్ కీప‌ర్), శివం దూబే, రియాన్ ప‌రాగ్, రింకూ సింగ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, ర‌వి బిష్ణోయ్, మ‌హ్మ‌ద్ సిరాజ్, ఖ‌లీల్ అహ్మ‌ద్.

శ్రీ‌లంక జ‌ట్టు : ప‌థుమ్ నిశాంక‌, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కుశాల్ పెరీర‌, క‌మిందు మెండిస్, చ‌రిత అస‌లంక‌(కెప్టెన్), చ‌మిందు విక్ర‌మ‌సింఘే, వ‌నిందు హ‌స‌రంగ‌, ర‌మేశ్ మెండిస్, మహీశ్ థీక్ష‌ణ‌, మ‌థీశ ప‌థిర‌న‌, అసితా ఫెర్నాండో.

Vamshi

Vamshi

Writer
    Next Story