వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన సోనూసూద్

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 2.5 కోట్లు(మొత్తం రూ. 5 కోట్లు) చొప్పున విరాళంగా ప్రకటించారు.

Sonu
X

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 2.5 కోట్లు(మొత్తం రూ. 5 కోట్లు) చొప్పున విరాళంగా ప్రకటించారు. విజయవాడలో సోనూ టీమ్ బకెట్లు, దుప్పట్లు చాపలు పంపీణీ చేశారు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆహారం, మెడిసిన్, ఇళ్లు లేని వారికి తాత్కాలిక షెడ్స్ వంటివి సాయం చేస్తున్నమని సోనూసూద్ తెలిపారు. ఎవరికీ ఏ ఆపద వచ్చినా ఆపద్బాంధవుడులా ముందుంటాడు.

ఈయన చేసిన సేవా కార్యక్రమాలకు గానూ యావత్ భారతదేశం శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కరోనా కష్టం కాలంలో భరోసా ఇచ్చి ఎంతో మందిని ఆదుకున్నాడు. సోనూసూద్‌ను డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కష్ట కాలంలో ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ తోడ్పాటు బలాన్నిస్తుందని పవన్ కొనియాడారు.

Vamshi

Vamshi

Writer
    Next Story